Breaking News

ఆక్రమించిన అటవీ భూముల స్వాధీనానికి ఉత్తర్వులు


Published on: 21 May 2025 18:35  IST

వైకాపా నేత, సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్‌లో ఆక్రమిత అటవీ భూములపై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జల ఎస్టేట్‌లో 55 ఎకరాల అటవీ భూమి ఉందని నిర్ధరించారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆక్రమణకు గురైన 55 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తాజాగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికారులు గురువారం అటవీభూములను స్వాధీనం చేసుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి