Breaking News

నక్సలిజంపై పోరాటంలో ఘన విజయమంటూ మోదీ పోస్ట్‌


Published on: 21 May 2025 18:49  IST

ఛత్తీస్‌గఢ్‌ లోని నారాయణపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘‘మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి