Breaking News

టీవీ ప్రసారాల్లో సైరన్‌లు వాడొద్దు.. మీడియాకు కేంద్రం ఆదేశాలు


Published on: 10 May 2025 17:17  IST

భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. టీవీ ప్రసారాల్లో ఎయిర్ రైడ్ (వైమానిక దాడి) సైరన్ల శబ్దాలను ఉపయోగించవద్దని కోరింది. పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని.. సైర‌న్‌ల‌ను ఉపయోగించి ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు తలెత్తకుండా చూడాల‌ని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి