Breaking News

విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు


Published on: 12 Dec 2025 18:50  IST

విశాఖపట్నం రావడం తన సొంతింటికి వచ్చినట్లుగా ఉందని కాగ్నిజెంట్ సంస్థ సీఈవో రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నం నగరం భవిష్యత్తులో ఎ.ఐ హబ్‌గా మారుతుందన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ సీఈవో రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ రవి కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి