Breaking News

రేవంత్, మెస్సీ మ్యాచ్.. సీపీ కీలక ఆదేశాలు


Published on: 12 Dec 2025 19:00  IST

రేవంత్, మెస్సీ మ్యాచ్‌ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.రేపు (శనివారం) సాయంత్రం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో టీవీలో చూడాలని కోరారు. 

Follow us on , &

ఇవీ చదవండి