Breaking News

రాజకోట్ వన్డేకు టీమిండియా రెడీ..


Published on: 14 Jan 2026 14:58  IST

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు(బుధవారం) రాజకోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి