Breaking News

ఐటీ ‘కౌశలం’తో ఉద్యోగమస్తు!


Published on: 31 Dec 2025 10:43  IST

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్‌ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది.నిరుద్యోగ యువత వివరాలను ఆర్టీజీఎస్‌లోని డేటాలేక్‌ ద్వారా సేకరించి, క్షేత్రస్థాయి లో అధికారులు ఇప్పటికే పరిశీలించారు.

Follow us on , &

ఇవీ చదవండి