Breaking News

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక..?


Published on: 27 May 2025 11:45  IST

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక ఈ నెల 30కి వాయిదా పడ్డాయి. వాస్తవానికి సోమవారమే ఈ రెండింటికీ నేతల పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారుచేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆది, సోమవారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కీలక చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీతో మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ అయ్యారు. కానీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం దిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి