Breaking News

శంషాబాద్‌లో కాల్పుల కలకలం..


Published on: 20 Nov 2025 17:40  IST

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. శంషాబాద్‌ మండలం నర్కుడా వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య కిరాయి విషయంలో వాగ్వాదం చోటుచేసుకున్నది. అదికాస్తా పెద్దది కావడంతో సమీర్‌దాస్‌ అనే ప్రయాణికుడిని, మరో ప్రయాణికుడు ఎయిర్‌ గన్‌తో కాల్చాడు. దీంతో సమీర్‌దాస్‌ కడుపులో తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Follow us on , &

ఇవీ చదవండి