Breaking News

కాల్పులు జరుపుతాం, బాంబు వేస్తాం..


Published on: 09 Dec 2025 16:16  IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. తమకు ఒక మిలియన్ ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తలు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బాంబు వేస్తామని మెయిల్ చేశారు.అంతేకాకుండా అమెరికా వెళ్ళే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి