Breaking News

అవి పాక్ పవర్‌ఫుల్ ఫేక్ న్యూస్..: పీఐబీ


Published on: 10 May 2025 13:01  IST

శనివారం తెల్లారిందో, లేదో పాక్‌ విషప్రచారం మళ్లీ మొదలైంది. పాకిస్థాన్‌కు చెందిన స్ట్రాటజిక్‌ ఎనలిస్ట్‌ అని చెప్పుకొనే కమర్‌ చీమా అనే వ్యక్తి, గ్లోబల్‌ డిఫెన్స్‌ ఇన్‌సైట్‌ అనే హ్యాండిల్స్‌ ద్వారా భారత్‌పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. పాక్‌ సైబర్‌ సైన్యం చేసిన దాడిలో భారత్‌ పవర్‌గ్రిడ్‌ 70శాతం నిర్వీర్యమైపోయిందన్నది దాని సారాంశం. భారత్‌కు చెందిన పీఐబీ దీనిని ఫ్యాక్ట్‌ చేసింది. ఇది శుద్ధ తప్పు అని తేలింది. దీంతో సోషల్‌ మీడియా వినియోగదారులు ఇలాంటి పాక్‌ తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని పీఐబీ సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి