Breaking News

కామారెడ్డిలో బాంబుల కలకలం..


Published on: 29 Dec 2025 15:17  IST

కామారెడ్డిలో బాంబులు కలకలం రేపాయి. గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్ అనే వ్యక్తికి చెందిన పొలంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. బాంబు పేలుడు ఘటనతో భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు, రైతులు ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు పెట్టి వెళ్లారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి