Breaking News

మంత్రి భావోద్వేగం..రంగంలోకి సీఎం చంద్రబాబు


Published on: 29 Dec 2025 15:41  IST

సాంకేతిక అంశాలను పక్కన పెట్టి జిల్లాల పునర్విభజనను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచాలంటూ వారు ఆందోళనలు, నిరసనలకు దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి