Breaking News

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు..


Published on: 29 Dec 2025 16:06  IST

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ మాదిరిగానే తనుగుల చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విమర్శతో అసెంబ్లీలో అలజడి రేగింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏమిటంటూ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి