Breaking News

నాచారంలో ఇంటి యజమాని హత్య..


Published on: 30 Dec 2025 17:55  IST

ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని సుజాత(65)ను బంగారం కోసం హత్య చేసిన కేసును నాచారం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు వెళ్లి ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు అంజిబాబును తీసుకువచ్చి గోదావరిలో గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుజాత మృతదేహం మామిడికుదురు సమీపంలోని అప్పనపల్లి-కె.ఏనుగుపల్లి మధ్య వైనతేయ గోదావరిలో లభ్యమైంది.

Follow us on , &

ఇవీ చదవండి